Vadi Biyyam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలకు ఒడి బియ్యం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇలా పెళ్లయిన మహిళలకు ప్రతి ఏడాది తమ పుట్టింటి వారు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా తమ కూతురికి కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోస్తుంటారు. అయితే ఇలా వడి బియ్యం పోయడానికి కారణం ఏంటి… ఒడి బియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఒడి బియ్యం సాంప్రదాయం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే… సాధారణంగా మనిషి శరీరంలో నాడులు కలిసే ప్రతి చోట ఒక చక్రం ఉంటుంది. ఇలా మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. ఈ ఏడు చక్రాలలో గౌరీదేవి ఏడు రూపాయలలో నిక్షిప్తమై ఉంటుంది.అందులో ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో ఒడ్డి యాన పీఠం ఉంటుంది. ఈ ఒడ్డి యాన పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మిగా భావిస్తారు. అందువల్ల వివాహం జరిగిన తర్వాత ఆడపిల్లలకు వడిబియ్యం సమర్పించడం అంటే ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మి అనే శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.
మహాలక్ష్మిగా భావించి తన అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆమెకు ప్రతి ఏడాది లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పుట్టింటి వారు ఒడి బియ్యం పోయడం జరుగుతుంది.తల్లి ఒడి అంటే రక్షణకు నిలయమని భావిస్తారు. మహాలక్ష్మిగా భావించే ఆడపిల్ల తమ కుటుంబ సభ్యులకు రక్షణగా నిలుస్తారని ఈ విధంగా ప్రతి ఏడాది వడి బియ్యం పోయడం వల్ల తమ కుమార్తె ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా తన ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా వెల్లు వెరుస్తాయని భావించి తల్లిదండ్రులు కుమార్తెకు ఒడిబియ్యం పోస్తారు.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.