Vadi Biyyam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలకు ఒడి బియ్యం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇలా పెళ్లయిన మహిళలకు ప్రతి ఏడాది తమ పుట్టింటి వారు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా తమ కూతురికి కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోస్తుంటారు. అయితే ఇలా వడి బియ్యం పోయడానికి కారణం ఏంటి… ఒడి బియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఒడి బియ్యం సాంప్రదాయం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే… సాధారణంగా మనిషి శరీరంలో నాడులు కలిసే ప్రతి చోట ఒక చక్రం ఉంటుంది. ఇలా మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. ఈ ఏడు చక్రాలలో గౌరీదేవి ఏడు రూపాయలలో నిక్షిప్తమై ఉంటుంది.అందులో ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో ఒడ్డి యాన పీఠం ఉంటుంది. ఈ ఒడ్డి యాన పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మిగా భావిస్తారు. అందువల్ల వివాహం జరిగిన తర్వాత ఆడపిల్లలకు వడిబియ్యం సమర్పించడం అంటే ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మి అనే శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.
మహాలక్ష్మిగా భావించి తన అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆమెకు ప్రతి ఏడాది లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పుట్టింటి వారు ఒడి బియ్యం పోయడం జరుగుతుంది.తల్లి ఒడి అంటే రక్షణకు నిలయమని భావిస్తారు. మహాలక్ష్మిగా భావించే ఆడపిల్ల తమ కుటుంబ సభ్యులకు రక్షణగా నిలుస్తారని ఈ విధంగా ప్రతి ఏడాది వడి బియ్యం పోయడం వల్ల తమ కుమార్తె ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా తన ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా వెల్లు వెరుస్తాయని భావించి తల్లిదండ్రులు కుమార్తెకు ఒడిబియ్యం పోస్తారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.