Health Tips: సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనుక డాక్టర్ని సంప్రదిస్తాము అలాంటి సమయంలో డాక్టర్స్ వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు ఈ క్రమంలోనే ఒకసారి మన నాలుకను కూడా ఆయన టెస్ట్ చేస్తారు. ఇలా నాలుక చెక్ చేసిన తర్వాత కొన్ని పరీక్షలు కూడా మనకు రాసిస్తూ ఉంటారు అయితే ఇలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే నాలుకను చూసి వారు ఏమి నిర్ధారణ చేసుకుంటారు. కొన్నిసార్లు మన నాలుక రంగులో కూడా మార్పులు రావడం మనం గమనిస్తుంటాము. ఇలా నాలుక రంగు మారితే ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా అసలు డాక్టర్లు ఎందుకు ఇలా పరీక్ష చేస్తారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మన నాలుక లేత గులాబీ రంగులోను లేదా ముదురు రంగులో ఉండి నాలుక పై చిన్నటి తెల్లటి పొర ఉంటే ఎలాంటి సమస్య లేదు. ఇక ఎల్లప్పుడూ కూడా మన నాలుక ఇలాగే ఉండి తడితో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అర్థం. అలాకాకుండా కొందరి నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి అలాగే నాలుక మొత్తం పొడిబారి పోతుంది. ఇలా తెల్లటి మచ్చలు ఉన్నాయి అంటే తప్పనిసరిగా నాలుకపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం. అలాగే నాలుక కొన్నిసార్లు నలుపు రంగులోకి మారుతుంది అలాంటి సమయంలో గొంతులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు అలాగే ఇది కొన్ని సార్లు క్యాన్సర్ కి కూడా కారణం అవుతుంది.
ఈ విధంగా నాలుక నలుపు రంగులోకి వచ్చిన వెంటనే మనం వైద్యున్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం అలాగే మరి కొంతమందిలో నాలుక నీలిరంగులోకి మారుతూ ఉంటుంది. ఇలా నీలిరంగులోకి నాలుక మారటం కూడా పెద్ద ప్రమాదమని చెప్పాలి. ఎప్పుడైతే మన శరీరంలో గుండె పనితీరు సరిగా చేయకుండా అన్ని భాగాలకు రక్తాన్ని సరిగా సరఫరా చేయదో అప్పుడే నాలుక నీలిరంగులోకి మారుతుంది. అలాగే మన శరీరానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ లభించలేదని అర్థం. ఇలా నాలుక నీలిరంగులోకి మారింది అంటే మనకు గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఈ విధంగా నాలుక రంగులో కనుక మార్పులు వస్తే వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం ఇక అనారోగ్యం చేసినప్పుడు కూడా డాక్టర్లు నాలుకను పరిశీలించేది కూడా ఇందుకేనని చెప్పాలి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.