Health Tips: సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనుక డాక్టర్ని సంప్రదిస్తాము అలాంటి సమయంలో డాక్టర్స్ వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు ఈ క్రమంలోనే ఒకసారి మన నాలుకను కూడా ఆయన టెస్ట్ చేస్తారు. ఇలా నాలుక చెక్ చేసిన తర్వాత కొన్ని పరీక్షలు కూడా మనకు రాసిస్తూ ఉంటారు అయితే ఇలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే నాలుకను చూసి వారు ఏమి నిర్ధారణ చేసుకుంటారు. కొన్నిసార్లు మన నాలుక రంగులో కూడా మార్పులు రావడం మనం గమనిస్తుంటాము. ఇలా నాలుక రంగు మారితే ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా అసలు డాక్టర్లు ఎందుకు ఇలా పరీక్ష చేస్తారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మన నాలుక లేత గులాబీ రంగులోను లేదా ముదురు రంగులో ఉండి నాలుక పై చిన్నటి తెల్లటి పొర ఉంటే ఎలాంటి సమస్య లేదు. ఇక ఎల్లప్పుడూ కూడా మన నాలుక ఇలాగే ఉండి తడితో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అర్థం. అలాకాకుండా కొందరి నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి అలాగే నాలుక మొత్తం పొడిబారి పోతుంది. ఇలా తెల్లటి మచ్చలు ఉన్నాయి అంటే తప్పనిసరిగా నాలుకపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం. అలాగే నాలుక కొన్నిసార్లు నలుపు రంగులోకి మారుతుంది అలాంటి సమయంలో గొంతులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు అలాగే ఇది కొన్ని సార్లు క్యాన్సర్ కి కూడా కారణం అవుతుంది.
ఈ విధంగా నాలుక నలుపు రంగులోకి వచ్చిన వెంటనే మనం వైద్యున్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం అలాగే మరి కొంతమందిలో నాలుక నీలిరంగులోకి మారుతూ ఉంటుంది. ఇలా నీలిరంగులోకి నాలుక మారటం కూడా పెద్ద ప్రమాదమని చెప్పాలి. ఎప్పుడైతే మన శరీరంలో గుండె పనితీరు సరిగా చేయకుండా అన్ని భాగాలకు రక్తాన్ని సరిగా సరఫరా చేయదో అప్పుడే నాలుక నీలిరంగులోకి మారుతుంది. అలాగే మన శరీరానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ లభించలేదని అర్థం. ఇలా నాలుక నీలిరంగులోకి మారింది అంటే మనకు గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఈ విధంగా నాలుక రంగులో కనుక మార్పులు వస్తే వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం ఇక అనారోగ్యం చేసినప్పుడు కూడా డాక్టర్లు నాలుకను పరిశీలించేది కూడా ఇందుకేనని చెప్పాలి.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…
Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…
Eyes: ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
This website uses cookies.