TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. అయితే ఈసారి పొలిటికల్ స్క్రీన్ పైకి వస్తున్న చేంజ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు కానున్న మహిళా రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని, తెలుగుదేశం పార్టీ ఒక భారీ మాస్టర్ ప్లాన్కు తెరలేపింది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగినప్పుడు మహిళా అభ్యర్థుల కొరత లేకుండా చూసేందుకు.. ఇప్పటి నుంచే నెక్స్ట్ జనరేషన్ క్వీన్స్ ను గ్రౌండ్ లోకి దించుతోంది. కేవలం పేరుకే వారసులుగా కాకుండా, సబ్జెక్ట్ నాలెడ్జ్, మైక్ పడితే అదరగొట్టే వాగ్ధాటి ఉన్న యువతను చంద్రబాబు, లోకేష్ లు లైన్ లోకి తెస్తుండడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా పెద్ద లీడర్ల కూతుళ్లు అంటే విదేశాల్లో చదువుకుని, బిజినెస్ లు చూసుకుంటూ ప్రైవేట్ లైఫ్ కే పరిమితం అవుతారని అనుకుంటారు. కానీ, టీడీపీలోని యంగ్ జనరేషన్ లేడీస్ ఆ అంచనాలను బ్రేక్ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి ఆల్రెడీ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతున్న తీరు, పార్టీ కేడర్ను నడిపిస్తున్న శైలి చూస్తుంటే.. ఫ్యూచర్ లో ఆమె ఒక పవర్ఫుల్ లీడర్ కాబోతోందని స్పష్టమవుతోంది.
ఇక తాజాగా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి పెళ్లి వేడుకలో మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ ఈ వ్యూహాన్ని మరింత బహిర్గతం చేశాయి. “మహిళా రిజర్వేషన్ వస్తోంది.. ఎమ్మెల్యే కావడానికి రెడీగా ఉండు” అని లోకేష్ ఆమెకు హింట్ ఇవ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవలం వీరే కాదు.. పార్టీ కోసం పనిచేసే ఇతర అనుబంధ విభాగాల నుంచి కూడా చురుకైన, చదువుకున్న యువతులను గుర్తించేందుకు టీడీపీ ఒక ప్రత్యేక అసెస్మెంట్ డ్రైవ్ కూడా నడుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
రాజకీయాల్లో కేవలం వారసత్వం చెబితే సరిపోదు.. ప్రజలను ఆకట్టుకునే మాటకారి తనం, ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేసే సబ్జెక్ట్ ఉండాలి. సరిగ్గా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న యువ టీమ్నే టీడీపీ ఇప్పుడు రెడీ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తారని చెబుతుంటారు. ఇప్పుడు మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం వెనుక కూడా అదే పెద్ద స్కెచ్ ఉంది. ఈ కొత్త తరం నాయకురాళ్లకు నేరుగా అసెంబ్లీ టికెట్లు ఇచ్చేయకుండా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వీరికి ఒక అగ్నిపరీక్షగా మార్చబోతున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో తిరిగి, ప్రజల సమస్యలపై పట్టు సాధించి, తమ సత్తా చాటుకున్న వారికే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ రేసులో ఛాన్స్ దక్కేలా రూల్స్ సెట్ చేస్తున్నారు.
అసెంబ్లీలోనూ, అటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ వాయిస్ ను బలంగా వినిపించగల ఒక స్మార్ట్ లేడీస్ బ్రిగేడ్ ను చంద్రబాబు, లోకేష్ ద్వయం సిద్ధం చేస్తోంది. చదువుకున్న యువతులు నేరుగా గడపగడపకూ వెళ్తుండడంతో ఓటర్లు కూడా కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి టీడీపీ నెక్స్ట్ జనరేషన్ క్వీన్స్ ను రంగంలోకి దించుతూ బాబు వేసిన ఈ పక్కా పొలిటికల్ స్కెచ్.. భవిష్యత్తులో ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ 'మహానాడు' సరికొత్త హంగులతో, సరిహద్దులు దాటిన ఉత్సాహంతో ప్రారంభమైంది. ఏటా పసుపు…
AP POLITICS: ఇటీవల ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పొలిటికల్…
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. నిన్నటివరకు ఏ పార్టీని…
AP POLITICS: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎన్నో మీమ్స్, ట్రెండ్స్ చూసుంటాం. కానీ, ఏకంగా దేశంలోని ప్రధాన…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర…
This website uses cookies.