Salaar : పృథ్వీ లేకపోతే ‘సలార్‌’లేదు : ప్రశాంత్ నీల్

Salaar : ప్రస్తుతం టాలీవుడ్ లో సలార్ మేనియా నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండింగ్ లో ఉంది. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్ లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ డిసెంబర్‌ 22న విడుదల కానుంది. ప్రభాస్ ఫ్యాన్స్, ప్రశాంత్ నీల్ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన సెకెండ్ ట్రైలర్ దుమ్ముదులుపుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులు కొత్త అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే మేకర్స్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నారు. లేటెస్టుగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పృథ్వీరాజ్ సుకుమారన్‌ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించారు.

salaar-without-prithviraj-there-is-no-salaar

ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ..”సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను సెకండ్‌ హీరోగా ఒప్పించడం సాధ్యమవుతుందా అని అనుకున్నాను. కానీ కథ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పారు. సలార్ లోని వరదరాజ మన్నార్‌ క్యారెక్టర్ లో ఒదిగిపోయే హీరో కోసం చాలా కసరత్తు చేశాం. చాలా మంది బాలీవుడ్‌ హీరోలను ట్రై చేయవచ్చు కదా అని సలహాలిచ్చారు. కానీ నా మైండ్ లో పృథ్వీరాజ్‌ ఉన్నారు. ఈ క్యారెక్టర్ కి ఆయన్నే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ప్రేమ, ద్వేషం ఈ రెండింటిని చూపించగల సత్తా పృథ్వీలో మాత్రమే ఉంది. పృథ్వీ ఒక నటుడిలా కాదు కొన్ని సన్నివేశాల్లో దర్శకుడిలా ఆలోచిస్తారు. నిజానికి ఇండస్ట్రీలో ఆయనకు ఉత్తమ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అని టైటిల్ ఇవ్వొచ్చు. సలార్‌ విషయంలో ఆయన నాతో ఎన్నో ఐడియాలను పంచుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పృథ్వీ లేకపోతే సలార్‌ లేదు”. అని ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు.

salaar-without-prithviraj-there-is-no-salaar

బాహుబలితో పాన్ ఇండియా స్టారైన ప్రభాస్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన మాస్ మూవీ ‘సలార్’. ఈ సినిమాలో తన మాస్ యాక్షన్ తో ఇరగదీసేందుకు రెడీ అయ్యాడు ప్రభాస్. డిసెంబరు 22న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి మూవీ రిలీజ్ కానుంది. దీనితో పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో అభిమానులు టికెట్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా హీరో నిఖిల్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం 100 టికెట్లను ఫ్రీ గా ఇస్తానని బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశాడు. ఇదిలా ఉంటే ఆఫ్‌లైన్‌లో టికెట్లపై పాపం ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స‌లార్ టికెట్ల ధ‌ర‌లు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. బెంగళూరులో సింగిల్ స్క్రీన్ టికెట్ ధర అక్షరాలా రూ. 600 పైనే పలుకనుందట, ఇక మల్టీఫ్లెక్స్‌ల్లో అయితే రూ.1000-రూ.1200 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఉందని టాక్ వినిపిస్తోంది. మరిఈ న్యూస్ లో ఎంత నిజముందో ఇంకా తెలియాల్సి ఉంది.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

6 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

7 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.