Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం ‘సేమ్ టు సేమ్’ అనిపిస్తోంది. ఒకప్పుడు అధికార పీఠంపై కూర్చుని రెండు తెలుగు రాష్ట్రాలను శాసించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు విపక్ష స్థానానికే పరిమితమయ్యారు. అయితే, ఓటమి తర్వాత ఈ ఇద్దరు ప్రాంతీయ పార్టీల అధినేతలు తీసుకుంటున్న నిర్ణయాలు, వారి బాడీ లాంగ్వేజ్, భవిష్యత్తు కార్యాచరణను గమనిస్తే.. ఇద్దరూ ఒకే స్క్రిప్ట్‌ను ఫాలో అవుతున్నారా అనే అనుమానం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

సాధారణంగా ఓడిపోయిన పార్టీలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడం ఆనవాయితీ. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీ మొహం చూసింది లేదు. అటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్ కూడా అదే బాట పట్టారు. మైకులు ఇవ్వడం లేదనో, ప్రతిపక్ష హోదా దక్కలేదనో కారణాలు ఏవైనా.. ఇద్దరు టాప్ లీడర్లు చట్టసభలకు దూరంగా ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్. మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతామనే బలమైన సంకేతాన్ని ఇద్దరూ తమ క్యాడర్‌కు పంపుతున్నట్లు కనిపిస్తోంది.

politics-target-2029-jagan-and-kcr-on-the-same-path

Politics: ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అసెంబ్లీకి నో చెప్పిన ఈ నేతలు.. జనం మధ్యకు వెళ్లేందుకు మాత్రం ఒకే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఇరు రాష్ట్రాల్లో పాదయాత్రలే శరణ్యమని నమ్ముతున్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపు ఒకే సమయంలో జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండటం విశేషం. సభల్లో మాట్లాడేదానికంటే, నేరుగా జనం గుండెల్లోకి దూసుకుపోవడమే 2029 టార్గెట్‌కు సరైన రూట్ అని ఇరు పార్టీల అధిష్టానాలు భావిస్తున్నాయి.

అయితే, ఈ ఇద్దరు నేతల సరికొత్త పొలిటికల్ ఫిలాసఫీ ఇప్పుడు ప్రజల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. సమస్యల మీద తక్షణ పోరాటాలు చేసి, ప్రభుత్వం మెడలు వంచి పరిష్కారాలు సాధించడం పాత పద్ధతి అన్నట్లుగా వీరి వైఖరి ఉంది. బాధితులు ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే.. “మరో రెండేళ్లు/మూడేళ్లు ఓపిక పట్టండి, మా ప్రభుత్వం రాగానే మీ సమస్యలు తీరుస్తాం” అంటూ భరోసా ఇస్తున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో జగన్ ఇస్తున్న స్టేట్‌మెంట్లు దీనికి అద్దం పడుతున్నాయి. మరి, “అధికారంలోకి వస్తేనే న్యాయం” అనే ఈ సరికొత్త విపక్ష ఫార్ములా 2029లో వీరికి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

3 hours ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

3 hours ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

1 day ago

International Yoga Day 2026: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగాతో ఈ ప్రయోజనాలు మీ సొంతం!

International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…

1 day ago

Puranapanda Srinivas: రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…

2 days ago

Mosquitoes: దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే ఒక్క దోమ కూడా ఉండదు..

Mosquitoes: వర్షాకాలం మొదలవడంతో ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండడం, మన ఇంటి పరిసర ప్రాంతాలను చెత్తాచెదారం ఉన్నప్పుడు కచ్చితంగా…

2 days ago

This website uses cookies.