Padutha Theeyaga: పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 23 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక 24వ సీజన్ త్వరలోనే ప్రసారం కానుంది. పాటల పోటీల కార్యక్రమంలో పాడుతా తీయగా షోకు సపరేట్ ట్రాక్ రికార్డ్, సపరేట్ క్వాలిటీ ఉంటుంది. ఇది 1996లో ప్రారంభమైంది. త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకోనుంది. ఈటీవీ పుట్టిన ఈ 30 ఏళ్లలో పాడుతా తీయగా షోకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో 500కి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు.
పాడుతా తీయగా షో మీద స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెరగని ముద్ర వేశారు. ఆయన ఇచ్చిన సూచనలు, పంచిన సంగీత జ్ఞానం, చెప్పిన విలువైన పాటలు ఈ షోను తెలుగు వారందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. ఇక ఇప్పుడు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ షోకు హోస్ట్గా ఉంటున్నారు. ఎస్పీబీ వారసత్వాన్ని ఆయన ముందుకు తీసుకు వెళ్తున్నారు.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ఈ షోకు జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. సునీత, విజయ్ ప్రకాష్ వంటి ప్రముఖ సింగర్లు ఈ షోలో జడ్జ్లుగా ఉంటూ తమ సంగీత జ్ఞానాన్ని కంటెస్టెంట్లకు, ఆడియెన్స్కు పంచుతున్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.