Kodali Nani: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర మొదలు కాగానే ఏపీ రాజధానిగా విశాఖపట్నం అంటూ ఏకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసి ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. అయితే అది వర్క్ కాలేదు. కాని కొంత వరకు టీడీపీ నాయకులు జగన్ కామెంట్స్ పై విమర్శలు చేశారు. ఇక సుప్రీం కోర్టులో ఉన్న అంశంపై జగన్ ఎలా మాట్లాడుతాడు అంటూ నిలదీశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వైపు వైఎస్ వివేకానంద హత్యా కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కి ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తుంది. సీబీఐ అధికారులు జగన్ రెడ్డి ఓఎస్డీ వరకు వచ్చేశారు.
మరో వైపు నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుతిరిగి వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ రెండు విషయాల చుట్టూ ప్రజల ఆలోచనలు తిరుగుతున్నాయి. అయితే ఈ అంశాలు వైసీపీపై వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు మరో కొత్త డైవర్షన్ ని తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియా ముందుకి వచ్చి సీనియర్ ఎన్టీఆర్ మరణంపై అనుమానం ఉందని కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలని కోరుతున్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ రాజకీయాలలోకి వద్దామని అనుకున్న సమయంలోనే వారి కుటుంబంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అన్నారు.
హరికృష్ణ తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారుతున్నారని పరిణామాలు కనిపించిన సమయంలో అయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అన్నారు. అలాగే నందమూరి తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్న టైంలో కుప్పంలో ఆయనకి గుండెపోటు రావడం హాస్పిటల్ లో పడటం జరిగిందని అన్నారు. వీటి వెనుక కుట్ర కోణం ఉందని కామెంట్స్ చేశారు. వీటి వెనుక అనుమానాలు ఉన్నాయని, సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే కొడాలి నాని కేవలం వైసీపీ వ్యూహంలో భాగంగానే ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయడానికి ఈ వ్యాఖ్యలు చేసి తెరపైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఎన్టీఆర్, నందమూరి కుటుంబం అభిమానిగా చెప్పుకునే కొడాలి నానితో ఈ రకమైన వ్యాఖ్యలు చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టి, ప్రజల దృష్టి పూర్తిగా వివేకానంద హత్యకేసు విచారణ, అలాగే కోటంరెడ్డి ఇష్యూ నుంచి డైవర్ట్ అవుతుందని ఇలా ప్లాన్ చేసినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.