Technology: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పరుగులు పెడుతుంది. అభివృద్ధి అంతా టెక్నాలజీతో అనుబంధమై నడుస్తుంది. ప్రపంచంలో మెజారిటీ ప్రజలు స్మార్ట్ ఫోన్ వినియోగానికి అలవాటు పడ్డారు. వారి రోజువారి జీవితాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన వస్తువుగా మారిపోయింది. అలాగే కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై ఉద్యోగాలు చేసే వారి సంఖ్య వందల కోట్లలోనే ఉంది. అన్ని అవసరాలకు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ అనేవి ఖచ్చితంగా అవసరమైన వస్తువులుగా మారిపోయాయి.
గత మూడేళ్ల కాలంలో కరోనా ప్రభావంతో పిల్లల చదువులు కూడా ఆన్లైన్ కి పరిమితమయ్యాయి. ఈ కాలంలో తరగతి చదువు లేకపోవడంతో డిజిటల్ క్లాసులు వింటూ పిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు మరలా తరగతి చదువులు మొదలైన కూడా మరోవైపు డిజిటల్ క్లాసులను కూడా విద్యాసంస్థలు ప్రోత్సహిస్తున్నాయి.
మరోవైపు చిన్న వయసు నుంచే పిల్లలు స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ కి, సోషల్ మీడియాలో కిడ్స్ రిలేటెడ్ వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫోన్స్ ఇవ్వకుంటే పిల్లలు మారం చేసే స్థాయికి వెళ్లిపోయారు. వీళ్లను నియంత్రించటం తల్లిదండ్రులకి కూడా సాధ్యం కావడం లేదు. స్మార్ట్ ఫోన్ లో వీడియో గేమ్స్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్ కి బానిసగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.
వారిలో మానసిక ఎదుగుదల ఉండదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే తాజాగా ఈ అంశంపై పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అమెరికా బ్రిటన్, బ్రెజిల్, చైనాతో పాటు భారత్లో కూడా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా మూడు వేల మంది పైచిలుకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇందులో 40 శాతం మంది తల్లిదండ్రులు వీడియో గేమ్ల కారణంగా పిల్లల్లో మానసిక సామర్థ్యం పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియా కారణంగా పిల్లల తెలివితేటలు పెరుగుతున్నాయని 30 శాతం మంది తల్లిదండ్రులు చెప్పడం విశేషం. అయితే ఆన్లైన్ తరగతుల వైపు తల్లిదండ్రులు తమ ఆసక్తిని చూపించలేదు. ప్రత్యక్షంగా తరగతి గదుల్లో చదువులు అయితేనే పిల్లలకు బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.