Categories: LatestNewsTips

KCR Breakfast : బడి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ గా ఇడ్లీ సాంబార్‌, ఉప్మా, పూరి..సీఎం కేసీర్ ఐడియా సూపర్

KCR Breakfast : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నయా పథకాన్ని శ్రీకారం చుట్టారు. సర్కారి బడుల్లో చదువుకునే పిల్లలకు దసరా గిఫ్ట్ గా ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ అనే సరికొత్త స్కీం ను ఇవాళ్టి నుంచి అమలు చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితాఇంద్రారెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్‌రావు ఈ కొత్త పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌లో షురూ చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌ మారేడుపల్లి గవర్నమెంట్ స్కూల్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని స్కూల్స్ లో మినిస్టర్లు , ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.

సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ అనే సరికొత్త స్కీం లో భాగంగా ప్రతీ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచే బ్రేక్ ఫాస్ట్ విద్యార్థులకు అబదిస్తారు. ఇలా వారంలో ఆరో రోజుల పాటు పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పెడతారు .

kcr-breakfast-telangana-cm-kcr-launched-breakfast-scheme-at-govt-schools

మరి బ్రేక్ ఫాస్ట్ మెనూ ఎలా తయారు చేశారో చూద్దాం..

సోమవారం: ఇడ్లీ సాంబార్‌/ గోధుమ రవ్వ ఉప్మా

మంగళవారం: పూరి/ టమాటా బాత్‌,

బుధవారం: ఉప్మా,సాంబార్‌/ కిచిడీ

గురువారం: మిల్లెట్‌ ఇడ్లీ / పొంగల్‌

శుక్రవారం: ఉగ్గాని/ పోహా/మిల్లెట్‌ ఇడ్లీ,కిచిడీ, చట్నీ

శనివారం: పొంగల్‌/వెజ్‌ పలావ్‌

సర్కారి బడుల్లో చదువుతున్న పిల్లలకు ప్రతీ రోజూ పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసున్నారు. ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ కి 45 నిమిషాల టైం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ప్రతీ స్కూల్ ఉదయం 8.45 గంటల నుంచి మొదలై.. మధ్యాహ్నం 3.45 గంటలకు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో స్కూల్ మొదలయ్యే 45 నిమిషాలు ముందుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగు పరచలానే కేసీర్ సర్కార్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అంతే కాదు ఈ బ్రేక్ ఫాస్ట్ పథకం అమలులోకి వస్తే.. విద్యార్థులు డుమ్మా కొట్టకుండా స్కూల్ కి వస్తారని, డ్రాపౌట్‌లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

kcr-breakfast-telangana-cm-kcr-launched-breakfast-scheme-at-govt-schools

సీఎం ‘అల్పాహారం’ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 స్కూల్స్ లో అమలు చేస్తున్నారు.అంటే 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. అందుకే విద్యార్థులు స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందే బడులకు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని స్కూల్స్ లో అక్షయపాత్ర సంస్థ అల్పాహారాన్ని అందజేయనుంది. మిగతా జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు అందజేస్తారు.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

3 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.