Politics: ఏపీలో అధికార వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అమరావతి శాశన రాజధానిగా, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రకటన చేసింది. అయితే దీనిపై ఏపీలో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని ఒకటే ఉండాలని అది అమరావతి మాత్రమే ఉండాలని అంటున్నాయి. పాలన వికేంద్రీకరణతో ఎలాంటి అభివృద్ధి జరగదని అంటున్నారు. మీకు సాధ్యం అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అన్ని జిల్లాలకి అభివృద్ధిని, పరిశ్రమలని విస్తరించాలని, దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం పరిపాలన అమరావతిలోనే జరగాలని, అలాగే అభివృద్ధి అమరావతి వేదికగా చేసి గొప్ప పట్టణాన్ని తయారు చేయాలని భావిస్తుంది.
ఇక మిగిలిన పార్టీలు అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రతిపక్షాల వాయిస్ ని వినడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఎలా అయినా తన పంతాన్ని నెగ్గించుకొని వచ్చే ఏడాది ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే దీనికి టీడీపీ అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికలకి కూడా వైసీపీ మూడు రాజధానులు, సంక్షేమ పథకాలు అజెండాగా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం లేదని ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. విశాఖ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రోడా మేలుగా అనే కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తానికి న్యాయం జరగదని అన్నారు.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.