Health Issues: ప్రస్తుత కాలంలో చాలామంది వర్క్ ఫ్రం హోం విధులను నిర్వహిస్తూ ఇంటికి పరిమితమవుతున్నారు. అయితే చాలామంది వారి పని నిమిత్తం ఎక్కువగా కూర్చుని పనులు చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. దాదాపు 10 గంటలపాటు ఒకే చోట స్థిరంగా కూర్చుని పని చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము. ఇలా ఒకే చోట కూర్చుని పని చేయటం వల్ల ఎన్నో రకాల సమస్యలు కలుగుతాయని మీరు ప్రమాదంలో పడపోతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనే విషయానికి వస్తే… కదలకుండా ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పని చేయటం వల్ల మన మెదడుకు సరైన స్థాయిలో రక్తప్రసరణ జరగక అధిక ఒత్తిడికి గురి కావలసి ఉంటుంది. ఓకే చోట కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల పని మీద ఏకాగ్రత తగ్గడమే కాకుండా, మానసికంగా అలసటకు కూడా గురవుతాము. ఇలా తరచూ పని చేయటం వల్ల కొన్ని సార్లు డిప్రెషన్ కి కూడా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులతోపాటు వెన్నునొప్పి మెడనొప్పి వంటి వ్యాధులు కూడా అధికమవుతాయి అందుకే గంటల తరబడి కూర్చోకుండా గంటకు 10 నిమిషాలు అయినా విరామం ఇచ్చి అటు ఇటు తిరుగుతూ పని చేయటం వల్ల ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులనుంచి బయట పడవచ్చు. ఇక ఎక్కువసేపు లాప్టాప్ లేదా సిస్టం ముందు కూర్చుని పని చేయటం వల్ల కంటి చూపుపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంతవరకు గంటకు కొన్ని నిమిషాల పాటు విరామం తీసుకోవడం ఎంతో ఉత్తమం.
Politics: రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. అయితే ఈసారి పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వినిపించిన…
Political: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇప్పుడు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే…
TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…
Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
This website uses cookies.