Categories: LatestMost ReadNews

Technology: ఎలాన్ మాస్క్ ఎత్తుగడ… ఆ ఒక్క బ్లూ టిక్ తోనే కోట్ల ఆదాయం

Technology:  ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యుగంలో ట్విట్టర్, పేస్ బుక్ అతిపెద్ద సామాజిక మాధ్యమాలుగా ప్రజలకి చేరువగా ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు, వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ తన వాయిస్ ని ప్రజలకి వినిపించేందుకు పేస్ బుక్ గతంలో ఉపయోగించేవారు. అయితే పేస్ బుక్ లో భద్రత ప్రమాణాలు తక్కువగా ఉండటంతో ట్విట్టర్ లోకి చాలా మంది సెలబ్రెటీలు షిఫ్ట్ అయిపోయారు.

ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీలు అందరూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. అలాగే వ్యాపారులు తమ ఉత్పత్తులని ప్రమోట్ చేసుకోవడానికి, రాజకీయ నాయకులు తమ స్వరాన్ని ప్రజలకి చేరవేయడానికి ట్విట్టర్ ని ప్రధాన మాధ్యమంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ట్విట్టర్ వన్ సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. రాజకీయ పార్టీలు ట్విట్టర్ ని తమ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నాయి. సెలబ్రెటీలని, రాజకీయ,.వ్యాపార దిగ్గజాలు ట్విట్టర్ లో తమ అఫీషియల్ ప్రొఫైల్ కోసం బ్లూ టిక్ మెయింటేన్ చేస్తున్నాయి.

Elon Musk new strategy with that one blue tickElon Musk new strategy with that one blue tickట్విట్టర్ యాజమాన్యం గతంలో ప్రముఖులు అందరికి బ్లూ టిక్ మార్క్ ని ప్రొఫైల్ వెరిఫై చేసి ఉచితంగా అందిస్తూ ఉండేది. ట్విట్టర్ లో ప్రకటనల ద్వారా, అలాగే సెలబ్రెటీ ప్రముఖుల ఫాలోవర్స్ ద్వారా ఎక్కువ యూజర్స్ ని సంస్థ పెంచుకుంది. అలాగే ఆదాయం కూడా పెంచుకుంది. అయితే ఎలాన్ మాస్క్ చేతిలోకి ట్విట్టర్ వచ్చిన తర్వాత ముందుగా సీఈవోని, అలాగే మరికొంత మంది కీలక ఎగ్జిక్యుటివ్స్ ని తొలగించారు. ఇక ఇప్పుడు భారీ ఎత్తున ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.

రెండు నెలల పే ఆఫ్ ఇచ్చేసి వారిని ఇంటికి పంపించేస్తున్నారు. అలాగే కొన్ని ప్రధాన కార్యాలయాలని మూసేస్తున్నారు. కొన్ని భద్రతాపరమైన మార్పులలో భాగంగా మోసేస్తున్నట్లు ఉద్యోగులకి మెయిల్స్ పంపిస్తున్నారు. మరో వైపు ట్విట్టర్ ని టేకోవర్ చేసిన ఎలాన్ మాస్క్ తాను పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా వసూలు చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇకపై బ్లూ టిక్ మార్క్ కావాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాలనే నిబంధనని తీసుకొచ్చారు. బ్లూ టిక్ మార్క్ కోసం 8 డాలర్ల రుసుము నిర్ణయించారు.

ఇక ఈ బ్లూ టిక్ మార్క్ ని ఎక్కువగా సెలబ్రెటీ ప్రముఖులు మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి వారికి ఇది పెద్ద మొత్తం కాదు. ఇక ఈ బ్లూ టిక్ మార్క్ ద్వారా ప్రతి నెల 29 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే భవిష్యత్తులో క్యాంపైన్స్ కోసం కూడా ప్రత్యేకమైన రుసుముని నిర్ణయించేందుకు ఎలాన్ మాస్క్ సిద్ధం అవుతున్నారని కార్పొరేట్ వర్గాలలో వినిపిస్తుంది. ట్విట్టర్ వినియోగాన్ని ఎలాన్ మాస్క్ కాస్ట్లీ వ్యవహారంగా మార్చడం వలన భవిష్యత్తులో దీనిని యూజర్స్ తగ్గిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

7 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago