Salt Water: సాధారణంగా ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని జుట్టు మొత్తం రాలిపోతుందని అందరు భావిస్తూ ఉంటారు. కానీ ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు నీటితో స్నానం చేయడం అంటే మనం స్నానం చేసే బకెట్లో కిలో ఉప్పు పోసుకొని చేయడం కాదండోయ్.. మనం స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు వేసుకుని స్నానం చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
మనం వంటలలో ఉపయోగించే ఉప్పులో కాల్షియం, జింక్,ఇనుము,పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల టేబుల్ సాల్ట్ను వంటకాలలో మరియు ఆహారంలో ఉపయోగిస్తారు. ఇక ఈ ఉప్పు కలిపిన నీటితో మనం స్నానం చేయటం వల్ల ఉప్పు నీటి స్నానం మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఉప్పులో ఉండే లవణాలు శరీరంపై తేమను బంధించి మాయిశ్చరైజర్లా వ్యవహరిస్తాయి.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించే, ఆరోగ్యాన్ని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. మార్కెట్లో అనేక రకాల సముద్రపు ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. డెడ్ సీ ఉప్పు, ఎప్సమ్ స్నానపు ఉప్పు, హిమాలయ స్నాన ఉప్పు. ఉప్పు నీటి స్నానం వల్ల గొంతు కండరాలు సులభతరం అవుతాయి. పలు రకాల చర్మ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉప్పునీటి స్నానం చేయడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది అయితే ఉప్పు నీటితో స్నానం చేసేటప్పుడు మన శరీరాన్ని చాలా సున్నితంగా రుద్దుకొని స్నానం చేయాలి.
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
This website uses cookies.