News: ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని వండేవారు. దీనికోసం ఎండిపోయిన కలపను ఉపయోగించి ఆరు బయట పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు చేసేవారు. ఉమ్మడి కుటుంబాలు అయినా కూడా ఇంట్లో అందరికీ ఆ కట్టెల పొయ్యి మీద మాత్రమే వంట చేసేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు దైనందిన జీవితంలో ప్రజల జీవన స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవారు చాలా తగ్గిపోయారని చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలలో కూడా 10 నుంచి 20 శాతం మంది మాత్రమే కట్టెల పోయ్యిని వంట చేయడం కోసం ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నారు.
మెజారిటీ ప్రజలు వంట కోసం గ్యాస్ ని వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సిటీలలో అయితే పూర్తిగా గ్యాస్ మీదనే వంటల కోసం ఆధారపడతారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్లో ఉండే వాయువులు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు. ఇంటర్నల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో 13 శాతం మంది చిన్నారులు గ్యాస్ స్టవ్ ఉధ్గారాల కారణంగా ఆస్తమా బారిన పడుతున్నారు. గ్యాస్ స్టవ్ మండుతున్న సమయంలో వెలువడే వాయువులు పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.