Categories: LatestMovies

Chiranjeevi : హనుమంతుడే నన్ను పిలిచాడు..అయోధ్యకు రావడం నా అదృష్టం

Chiranjeevi : దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం మరికొద్ద గంటల్లో ప్రారంభం కానుంది. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం కోట్లాది కళ్లు కన్న కలలు ఇవాళ్టితో నెరవేరనున్నాయి. అయోధ్య రామ మందిరంలో ఇవాళ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరగనుంది. దేశంలోనే గొప్ప కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో భారతదేశం మొత్తం శ్రీరాముని భక్తులు సంబరాలు చేసుకుంటున్నారు. జై శ్రీరాం నామస్మరణతో కొత్త సందడిగా మారింది. వీధులన్నీ హనుమయ్య విగ్రహాలు, రామును గీతాలాపనతో ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని కన్నులారా చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలెబ్రిటీలు అయోధ్యకు చేరుకుంటున్నారు. లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవి అయోధ్యకు చేరుకున్నారు. మెగాస్టార్ తో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలు అయోధ్యకు వచ్చారు. ఈ క్రమంలో జాతీయ మీడియా ముందు చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

chiranjeevi-reached-ayodhya-ram-mandir-pran-pratishtha-event-with-family

అయోధ్య రామ మందిరంలో ఘనంగా జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలను కేంద్రం పిలుపించింది. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్రముఖలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఇందులో కొంతమందికి కేంద్ర సర్కార్ పెద్దలు ప్రత్యేక చొరవ తీసుకుని మరీ ఆహ్వాన పత్రికలను పంపించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవికి ఆయన కుంటుంబ సభ్యులకు అయోధ్య రామ మందిరంలో జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఆయనతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన మరికొంత మంది సెలబ్రిటీలను కూడా పిలిచింది. రామ్ చరణ్, మోహన్ బాబు, ప్రభాస్ సహా చాలా మంది పేర్లు ఆహ్వాన లిస్టులో ఉన్నాయి. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఆయన కటుంబసభ్యులతో సహా ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు

chiranjeevi-reached-ayodhya-ram-mandir-pran-pratishtha-event-with-family

ఈ సందర్భంగా జాతీయ మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ..” దేశంలో జరిగే ఈ మహోన్నత కార్యక్రమానికి ఆహ్వానం అందండం చాలా గర్వంగా ఉంది. 500 సంవత్సరాలకుపైగా యావత్ దేశం మొత్తం కన్న కల ఇవాళ ఎట్టకేలకు నెరవేరబోతుంది. ఈ అద్భుతమైన దైవ కార్యక్రమానికి కుటుంబంతో సహా నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి దైవకార్యానికి పూనుకున్న కేంద్ర సర్కార్ చొరవ ఎంతో గొప్పది కొన్ని కోట్ల మంది భారతీయుల కోరికను కేంద్రం, ప్రధాని మోదీ గారు ఇవాళ నిజం చేయబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని దగ్గరుండి చూడటం నా అదృష్టం. నేను హనుమంతుడి భక్తుడిని, ఆయన నాకు ఇష్టదైవం. ఆయనే ఈ దైవకార్యానికి నన్ను పిలిచాడు. ఈ నిమిషాన్ని నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను”. అని చిరంజీవి తెలిపారు.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

5 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.