Curd: మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాము. ఇలా పెరుగును తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయనే విషయం మనకు తెలిసిందే. అదే విధంగా మనం తీసుకున్న ఆహారం కూడా తేలికగా జీర్ణం అవుతుంది. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజన సమయంలో తప్పనిసరిగా పెరుగు ఉండేలా చూసుకుంటూ ఉంటాము. అయితే వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. అలాగే వర్షాలు కూడా అధికంగా పడుతున్న తరుణంలో పెరుగును తినటం వల్ల జలుబు చేస్తుందని చాలామంది పెరుగును తినకుండా ఉంటారు.
ఇలా వర్షాకాలంలో చలువ చేస్తుందన్న ఉద్దేశంతో పెరుగును కనుక మనం పక్కన పెట్టినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది .
ఇక ఈ వర్షాకాలంలో పెరుగు తింటే డయోరియా వంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. అంతే కాదండోయ్ ఊబకాయంతో, అధిక బరువుతో బాధపడేవారికి పెరుగు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక గుండె సమస్యలు కూడా మన దరి చేరవు. ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందింప చేస్తాయి. అందుకే వర్షాకాలంలో తప్పనిసరిగా పెరుగు తీసుకోవడం ఎంతో ముఖ్యం అయితే ఎవరైతే ఆస్తమా వంటిసమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారు రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం తినడం మంచిది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.