Curd: మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాము. ఇలా పెరుగును తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయనే విషయం మనకు తెలిసిందే. అదే విధంగా మనం తీసుకున్న ఆహారం కూడా తేలికగా జీర్ణం అవుతుంది. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజన సమయంలో తప్పనిసరిగా పెరుగు ఉండేలా చూసుకుంటూ ఉంటాము. అయితే వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. అలాగే వర్షాలు కూడా అధికంగా పడుతున్న తరుణంలో పెరుగును తినటం వల్ల జలుబు చేస్తుందని చాలామంది పెరుగును తినకుండా ఉంటారు.
ఇలా వర్షాకాలంలో చలువ చేస్తుందన్న ఉద్దేశంతో పెరుగును కనుక మనం పక్కన పెట్టినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది .
ఇక ఈ వర్షాకాలంలో పెరుగు తింటే డయోరియా వంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. అంతే కాదండోయ్ ఊబకాయంతో, అధిక బరువుతో బాధపడేవారికి పెరుగు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక గుండె సమస్యలు కూడా మన దరి చేరవు. ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందింప చేస్తాయి. అందుకే వర్షాకాలంలో తప్పనిసరిగా పెరుగు తీసుకోవడం ఎంతో ముఖ్యం అయితే ఎవరైతే ఆస్తమా వంటిసమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారు రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం తినడం మంచిది.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.