Curd: మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాము. ఇలా పెరుగును తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయనే విషయం మనకు తెలిసిందే. అదే విధంగా మనం తీసుకున్న ఆహారం కూడా తేలికగా జీర్ణం అవుతుంది. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజన సమయంలో తప్పనిసరిగా పెరుగు ఉండేలా చూసుకుంటూ ఉంటాము. అయితే వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. అలాగే వర్షాలు కూడా అధికంగా పడుతున్న తరుణంలో పెరుగును తినటం వల్ల జలుబు చేస్తుందని చాలామంది పెరుగును తినకుండా ఉంటారు.
ఇలా వర్షాకాలంలో చలువ చేస్తుందన్న ఉద్దేశంతో పెరుగును కనుక మనం పక్కన పెట్టినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది .
ఇక ఈ వర్షాకాలంలో పెరుగు తింటే డయోరియా వంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. అంతే కాదండోయ్ ఊబకాయంతో, అధిక బరువుతో బాధపడేవారికి పెరుగు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక గుండె సమస్యలు కూడా మన దరి చేరవు. ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందింప చేస్తాయి. అందుకే వర్షాకాలంలో తప్పనిసరిగా పెరుగు తీసుకోవడం ఎంతో ముఖ్యం అయితే ఎవరైతే ఆస్తమా వంటిసమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారు రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం తినడం మంచిది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.