Karnataka Elections: కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఓడిపోయినా స్థానాలలో 50 వరకు తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉన్నవే కావడం విశేషం. గత ఎన్నికలలో బీజేపీకి ఆదిక్యం ఇచ్చినవి కూడా ఇవే నియోజకవర్గాలు. అయితే ఇప్పుడు అక్కడే తెలుగు ఓటర్లు బీజేపీని గద్దె దించడానికి కారణం అయ్యారు. ఈ విషయం ఇప్పటికే కర్ణాటక నాయకులు కూడా గ్రహించారు. అయితే ఇప్పుడు బీజేపీ ఓటమికి మరో ప్రధాన కారణం కూడా ఉందనే మాట వినిపిస్తోంది. అది వైసీపీతో బీజేపీ నడుపుతున్న పరోక్ష పొత్తు. నిజానికి ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది.
అయితే కేంద్ర నాయకత్వం జనసేనాని కంటే వైఎస్ జగన్ ని ఎక్కువగా విశ్వసిస్తోంది అనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ప్రచారం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పిన కూడా వైసీపీకి సపోర్ట్ గా ఉండే నాయకులు అడ్డుపడినట్లు టాక్. తెలుగు ప్రజలు ఏపీలో వైసీపీ వైపు ఉన్నారని, అది కూడా రాయలసీమలోకి సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాలు కాబట్టి కచ్చితంగా జగన్ ప్రభావం చేయగలరని భావించారంట. వైసీపీ నుంచి కూడా కర్ణాటక ఎన్నికలలో రాయలసీమ సరిహద్దు జిల్లాలలో బీజేపీకి సపోర్ట్ చేస్తామని హామీ లభించిందంట.
అలాగే కొంతమంది వైసీపీ నాయకులు సరిహద్దు జిల్లాలలో బీజేపీ కోసం ప్రచారం కూడా చేశారని టాక్. బీజేపీ జగన్ మీద నమ్మకం ఉంచి పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టడం జరిగిందని టాక్. అయితే వైసీపీ ప్రచారం బీజేపీకి ఏ విధంగా కలిసిరాలేదని, పైపెచ్చు వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికలలో తెలుగు ప్రజల ప్రభావం ఉన్న జిల్లాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని టాక్. దీంతో బీజేపీ ఇప్పుడు పునరాలోచించుకొని వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపిస్తుందనే మాట వినిపిస్తోంది.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.