Science: ఖగోళంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల ఉనికిపై నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని దేశాలు విశ్వంపై ఆధిపత్యం కోసం వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతూ ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇండియా ఓ వైపు గ్రహాల ఉనికిపై, అంతరిక్ష పరిశోధనలు ఎన్నో చేస్తుంది. దీనికోసం రాకెట్స్ ని ప్రయోగిస్తుంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్రహాలని గుర్తిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భూమిపై కాకుండా ఇతర గ్రహాలలో జీవం ఉనికి గురించి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే నీరు ఉన్న చోట జీవం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో నీటి ఉనికి ఎక్కడ ఉందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నాసాకి చెందిన హబుల్ టెలిస్కోప్ రెండు కొత్త గ్రహాలని గుర్తించింది. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్నట్లు కూడా టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. అయితే ఇవి మన నక్షత్ర మండలంలో కాకుండా 218 కాంతి సంవత్సరాల దూరంలో లీరా నక్షత్ర మండలంలో ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్న నక్షత్రం మరుగుజ్జు నక్షత్రంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్న నేపధ్యంలో జీవానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా నాసా పరిశోధకులు చెబుతున్నారు.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.