Science: ఖగోళంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల ఉనికిపై నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని దేశాలు విశ్వంపై ఆధిపత్యం కోసం వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతూ ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఇండియా ఓ వైపు గ్రహాల ఉనికిపై, అంతరిక్ష పరిశోధనలు ఎన్నో చేస్తుంది. దీనికోసం రాకెట్స్ ని ప్రయోగిస్తుంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్రహాలని గుర్తిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భూమిపై కాకుండా ఇతర గ్రహాలలో జీవం ఉనికి గురించి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే నీరు ఉన్న చోట జీవం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో నీటి ఉనికి ఎక్కడ ఉందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నాసాకి చెందిన హబుల్ టెలిస్కోప్ రెండు కొత్త గ్రహాలని గుర్తించింది. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్నట్లు కూడా టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. అయితే ఇవి మన నక్షత్ర మండలంలో కాకుండా 218 కాంతి సంవత్సరాల దూరంలో లీరా నక్షత్ర మండలంలో ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్న నక్షత్రం మరుగుజ్జు నక్షత్రంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ గ్రహాలపై నీటి జాడలు ఉన్న నేపధ్యంలో జీవానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా నాసా పరిశోధకులు చెబుతున్నారు.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.